ఉత్తరాంధ్ర సమస్యలపై తెలుగుదేశం పార్టీ ఆందోళనకు పిలుపునిస్తే అధికార పార్టీ ఎందుకు భయపడుతుందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ప్రశ్నించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఉత్తరాంధ్రలో ఆస్తుల విధ్వంసం, భూదందా, విజయసాయిరెడ్డి అక్రమాలపై టీడీపీ పోరాడుతుందని తెలిపారు. టీడీపీ ఆందోళనలను ఆపడానికి పోలీసులను అడ్డుపెట్టి అధికారపార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. అధికార పార్టీకి దమ్ముంటే రేపు 11 గంటలకు రుషికొండ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. విజయసాయి రెడ్డి దందాలకు మద్దతునిచ్చిన మంత్రి గుడివాడ అమర్ ఉత్తరాంధ్ర ద్రోహిగా మిగిలారన్నారు. అధికార పార్టీ తాటాకు చప్పుళ్ళకు బెదిరేది లేదని.. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా రుషికొండ వద్ద ఆందోళన చేపట్టి తీరుతామని ప్రణవ్ గోపాల్ స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa