ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీకి 100 ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు అందించిన దాతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 28, 2022, 11:45 AM

తిరుమల దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులకు  అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగుల ద్విచక్ర వాహనాల పార్కింగ్‌ కోసం రూ. 54 లక్షలతో నిర్మించిన పార్కింగ్‌ షెడ్‌ను శుక్ర‌వారం సుబ్బారెడ్డి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. తిరుమలలో పనిచేసే ఉద్యోగులకు ఎలక్ట్రికల్ బైక్‌లపై రాయితీ అందిస్తామని వెల్లడించారు..  టీటీడీకి 100 ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు దాతలు అందించారని తెలిపిన ఆయన.. నవంబర్ 1వ తేదీ నుంచి సర్వదర్శనం, ఎస్.ఎస్.డి టోకెన్ జారీ చేస్తామన్నారు . డిసెంబర్ 1వ తేదీ నుంచి బ్రేక్ దర్శనం టికెట్స్ సమయంలో మార్పులు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని వెల్లడించారు.. ముందుగా అనుకున్న విధంగా 10 గంటలు నుంచి 12గంటలు అనుకున్నాం, కల్యాణోత్సవం భక్తులు అదే సమయంలో ఉంటారు అనే సూచనతో కొద్ది మార్పులు చేశాం.. ఉదయం 8 గంటల నుంచి 8.30 గంటల మధ్య బ్రేక్ దర్శనం ప్రయోగాత్మకంగా ప్రారంభించి పరిశీలిస్తామని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa