ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విల్ ఛైర్ లో మంత్రి ఆదిమూలపు సురేష్.. ఫోటో వైరల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 29, 2022, 12:22 AM

ఇటీవల ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వీల్ ఛైర్‌లో ఉన్న ఫోటో ఒకటి వైరల్ అయ్యింది. మంత్రికి ఏమైందని అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మంత్రి ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. మంత్రి ఆదిమూలపు సురేష్ కు మోకాలికి సర్జరీ జరిగినట్లు తెలిపారు. మంత్రికి గురువారం హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు మోకాలికి శస్త్రచికిత్స చేశారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అయ్యింది.


మంత్రి రాష్ట్రంలో టిడ్కో గృహల ప్రారంభోత్సవాలు కార్యక్రమాల్లో సుడిగాలి పర్యటన చేశారు. గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం కూడా నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై తిరుగుతున్నారు. అయితే ఇటీవల కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపతున్నారు. దీంతో వైద్యుల సూచన మేరకు ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని వైద్యులు తెలిపారు. త్వరలోనే రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యంగా తన యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని .తనపై అభిమానం చూపుతున్న రాష్ట్ర ప్రజలు యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa