రాజకీయ గొడవలతో వార్తల్లో ఇటీవల నిలిచిన సొంత నియోజకవర్గం కుప్పంపై మాజీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు సమీక్షల మీద సమీక్షలు జరుపుతున్నారు అని వైసీపీ నాయకులూ వాపోతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఇక్కడ ఓడిపోతే పరువు పోతుందనే దిగులు తెలుగుదేశం అధినేతకు పట్టుకుంది. మొన్నటి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వచ్చిన జనం స్థానికులు కాదనే మాటతో పాటు అనేక అభాండాలు పాలకపక్షంపై వేశారు కుప్పం సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. తన పాత సొంత ‘ఒరిజినల్’ నియోజకవర్గం చంద్రగిరి మాదిరిగానే కుప్పం కూడా వచ్చే ఎన్నికల్లో తనను ఓడిస్తుందనే భయం బాబు గారికి పట్టుకున్నట్టు కనిపిస్తోంది. నారావారిపల్లె మనిషిగా గుర్తింపు పొందిన ‘టీడీపీ స్థాపకుడి అల్లుడి’ని 1983 జనవరిలో జరిగిన ఎన్నికల్లో సొంత చంద్రగిరి జనం ఓడించిన విషయం ఆయన మరవలేదు. అందుకేనేమో రెండు పొరుగు రాష్ట్రాలను ఆనుకుని ఉన్న కుప్పంపై నారా వారి ఆందోళన. 1989 నుంచి 2019 వరకూ తనను గెలిపించిన కుప్పం ఓటర్లపై తెలుగుదేశం అధ్యక్షుడికి ఎన్ని అనుమానాలో ఇప్పుడు అని వైసీపీ నాయకులూ వాపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa