ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప‌రిపాల‌న వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ లో ర్యాలీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 29, 2022, 03:06 PM

క‌ర్నూలులో న్యాయ రాజ‌ధాని ఏర్పాటు చేయాల‌ని కోరుతూ..మూడు రాజ‌ధానులకు మ‌ద్ద‌తుగా రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు ఉద్య‌మ బాట ప‌ట్టారు. తిరుపతిలో వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో భారీ ర్యాలీ చేప‌ట్టారు.  రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శనలో పెద్ద ఎత్తున విద్యార్థులు,యువ‌కులు, ఉద్యోగులు, మేధావులు, ప్ర‌జా సంఘాల నాయ‌కులు, ప్ర‌జా ప్ర‌తినిధులు పాల్గొని నిన‌దించారు.  మూడు రాజధానులు, ప‌రిపాల‌న వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ గుండె చప్పుడు వినిపిస్తూ మహా ప్రదర్శన చేప‌ట్ట‌డంతో తిరుప‌తిన‌గ‌రం జ‌న‌సంద్రంగా మారింది.  స్థానిక కృష్ణాపురం ఠాణా వద్ద నుంచి ప్రారంభమైన మహా ప్రదర్శన.. గాంధీ రోడ్డు, తిలక్ రోడ్డు మీదుగా నగర పాలక సంస్థ కార్యాలయం వరకు వేలాదిమందితో కొనసాగుతోంది.  తిరుపతి మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ప్ర‌జా సంఘాల నాయ‌కులు మాట్లాడారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa