ఒంగో లులోని శర్మాకాలేజి క్రీడామైదానంలో అసోసియేషన్ ఆఫ్ ఓరల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఛాప్టర్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్ర డెంటల్ సర్జన్స్ వైద్యుల టీ20 క్రికెట్ మ్యాచ్ శనివారం ఉత్సా హంగా జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన తె లంగాణ జట్లు 19.2 ఓవర్లకు 6 వికెట్లు నష్టపో యి 159 పరుగులు చేసింది. అనంతరం ఆంధ్ర జట్టు 155 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తెలంగాణ జట్టు విజయం సాధించింది. కాగా లక్ష్మణ్రాయ్, డ్రావింద్, వినోద్ బిర్రా, సంతోష్ బ్యాటింగ్లో ప్రతిభ సాధించి జట్టు గెలుపు కో సం కృషి చేశారు. రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నామి నేని కిరణ్కుమార్ నిర్వాహకులుగా వ్యవహరిం చారు. ముఖ్యఅతిథులుగా న్యాయమూర్తి ఆర్.శర త్బాబు హాజరై విజేతలకు కప్తోపాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్ ట్రోఫీలను అందజేశారు. న్యాయవాది చింతపల్లి ప్రతాప్కుమార్, డాక్టర్ జీవన్కుమార్ తదితరు లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa