కడప నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అధికారులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేసి అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని డిప్యూటీ సీఎం అంజాద్ బాష అన్నారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నగర మేయర్ సురేష్ బాబు అధ్యక్షతన జరిగిన నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ కడప నగరాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa