ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారని తెలుగు దేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు వైఎస్సార్ జిల్లా కడపలో వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఎవరూ కేసు పెట్టకపోయినా సీఐడీ కావాలనే కేసులు పెడుతుందని దుయ్యబట్టారు. అంబేద్కర్ వాదినని చెప్పుకునే సీఐడీ చీఫ్ సునీల్ కుమార్.. ఆదర్శంగా ఉండాల్సింది పోయి, రాజారెడ్డి రాజ్యాంగానికి కొమ్ముకాస్తున్నారని దుయ్యబట్టారు.
సాటి దళితుడు డాక్టర్ సుధాకర్పై పిచ్చోడు అనే ముద్రవేసి చనిపోయేలా చేశారని వంగలపూడి అనిత ఫైరయ్యారు. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్కు అంబేడ్కర్ వారసుడని చెప్పుకునే అర్హత లేదన్నారు. ఇక, జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి నాటకమాడి ముఖ్యమంత్రి అయ్యారని.. దళితుడైన ఆ కేసు నిందితుడు శ్రీను నాలుగు సంవత్సరాలుగా జైలులో మగ్గిపోతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. కోడి కత్తి శ్రీను తల్లిదండ్రులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వెళ్తే వెనక్కు పంపారని చెప్పారు. దళితులను అడ్డం పెట్టుకుని రాజ్యాధికారం చేపట్టిన జగన్ కుటుంబం.. ఇప్పుడు వారినే తుంగలో తొక్కుతుందన్నారు.. దళితుడైన సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ను అడ్డం పెట్టుకుని సీఎం జగన్ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. వీటన్నింటిపై పీవీ సునీల్ కుమార్ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.
ఎస్సీ సబ్ ప్లాన్ను నిర్వీర్యం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర పీవీ సునీల్ కుమార్కు ఎలా పని చేయాలనిపిస్తోందని వంగలపూడి అనిత ప్రశ్నించారు. తాను కూడా ఒక దళితురాలిగా అడుగుతున్నా.. మీకు చిత్తశుద్ధి ఉంటే జగన్ నామస్మరణ ఆపాలని డిమాండ్ చేశారు. పీవీ సునీల్ కుమార్ వ్యవహారశైలి వల్ల చాలా మంది పోలీసులు వారి ఉద్యోగాలకు ఎసరు తెచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమని.. అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదలబోమని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa