భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు ఆదర్శనీయమని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం నియోజకవర్గం ఇన్చార్జి బోడా వెంకట్, నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అన్నారు. ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా సోమవారం స్థానిక వై-జంక్షన్లోని ఇందిరా తపోవనంలో విగ్రహానికి వారు, పీసీసీ కార్యదర్శి బెజవాడ రంగారావు, సభ్యులు చింతాడ వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారన్నారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ చేపట్టిన జోడో యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, యాత్రకు తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న స్పందన చూస్తుంటే 2024లో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అందుకోసం పార్టీ శ్రేణులు శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు అబ్దుల్లా షరీఫ్, కిషోర్కుమార్ జైన్, బాలాజీశర్మ, బత్తిన చంద్రరావు, ఇజ్జరౌతు విజయలక్ష్మి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa