భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటన ఖరారైంది. ఈ మేరకు అధికారకంగా బుధవారం ప్రకటన వెలువడింది. ఈనెల 11వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ప్రత్యేక విమానంలో ప్రధాని విశాఖ చేరుకుంటారు. గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఆరోజు రాత్రికి ప్రధాని విశాఖలోని బస్ చేస్తారు. 12 తేదీ ఉదయం ఆంధ్ర యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయనను పలు పథకాలకు ప్రారంభత్సవాలు శంకుస్థాపనలు చేయను న్నారు. ప్రధాని బహిరంగ సభలో జగన్ కూడా పాల్గొంటారు.
400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వే స్టేషన్ నవీకరణ, ఈస్ట్ కోస్ట్ జోన్ పరిపాలన భవన సముదాయానికి శంకుస్థాపన, 260 కోట్లతో చేపట్టిన వడ్లపూడిలో వ్యాగన్ వర్క్ షాప్, 26 వేల కోట్లతో చేపట్టిన హెచ్ పీ సి ఎల్ నవీకరణ , విస్తరణ పనులు, 445 కోట్లతో చేపట్టిన ఐఐఎం పరిపాలన భవనానికి ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 152 కోట్లతో చేపట్టనున్న చేపల రేవు నవీకరణ ప్రాజెక్టు, 560 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకు పోర్టు రహదారికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. విశాఖ వారణాసి మధ్య కొత్తగా ప్రవేశపెట్టనున్న రైలుకు ప్రధాని జండా ఊపి ప్రారంభించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ బహిరంగ సభకు సుమారు లక్ష మందిని తరలించే ఏర్పాట్లు బిజెపి నేతలు చేస్తున్నారు. కాగా ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖ జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ భద్రత ఏర్పాట్లు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa