విశాఖపట్నంలో అక్టోబర్ 15న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వినితోపాటు మరికొంతమంది మహిళా నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని, నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ మహిళా కమిషన్ సభ్యులకు మంగళవారం జనసేన మహిళా నేతలు వినతిపత్రం సమర్పించారు. ఆ రోజు జరిగిన దిశ పోలీసుస్టేషన్, నోవోటెల్ సీసీ పుటేజీని పరిశీలించాలని కోరారు. మహిళా కమిషన్కు వినతిపత్రం సమర్పించిన వారిలో రాష్ట్ర జిల్లా, నగర నేతలున్నారు. యశస్విని, రావి సౌజన్య, మల్లెపు విజయలక్ష్మి, పోతిరెడ్డి అనిత, చింతల లక్ష్మీకుమారి, షేక్ మొబినా, ఆలియా బేగం, పాలరజని,దోమకొండ మేరీ, చందు సుజాత, సుజాతరావు, సలాది భానుమతి, సమల సుజాత, ఆలమూరి శ్రీదేవి, గాయత్రికుమారి పాల్గ్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa