వివాహేతర సంబంధం ఉన్న మహిళ దూరమైందని మనస్తాపం చెందిన ఒక యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీస్ వారు వివరాల మేరకు ... కరప మండలం గొర్రిపూడి గ్రామానికి చెందిన అంకన దేశమ్మ(20) అనే యువకుడికి ఒక వివాహితతో పరిచయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న మహిళ భర్త ఆమెను తనతోపాటు హైదరాబాద్కు తీసుకెళ్లిపోయాడు. సదరు మహిళ దేశమ్మకు ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి తనను తీసుకువెళ్లాల్సిందిగా అభ్యర్థించింది. దీంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అతడు గ్రామంలోని ఒక సపోటా తోటలో సోమవారం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. క్షతగాత్రుడిని బంధువులు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa