రాష్ట్రంలో కాపులను అన్యాయం చేసిన ద్రోహి సీఎం జగన్ అని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యర్రా వేణు గోపాలరాయుడు అన్నారు. రాజమహేంద్రవరంలో మంగళవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పనిలేని కాపు మంత్రులు మంజీరాలో చేరి పిల్లి తల గోకినట్టుగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. కాపులను అన్యాయం జరుగుతుందటే చోద్యం చూసిన మంత్రులు ,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పు డు కాపులను మభ్యపెట్టడానికి తయారయ్యారని విమర్శించారు. కాపులకు న్యాయం జరిగిందంటే చంద్రబాబు హయాంలోనే జరిగిందన్నారు. కాపు కార్పొరేషన్ నుంచి పలు పథకాలు మంజూరు చేశారన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, మాలే విజయలక్ష్మి, జక్కంపూడి అర్జున్, బండారు శ్రీనివాసరావు, శెట్టి జగదీష్, హరిబెనర్జీ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa