దోపిడీదారులకు ,అవినీతి పరులకు కీలక పదవులు ఇచ్చి రాష్ట్రాన్ని సీఎం జగన్ బ్రష్టుపట్టించారని టీడీపీ నాయకులూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు.రాజమహేంద్రవరంలోని తన నివాసంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జగన్ పాలనలో ఎవ్వరికి నాయ్యం జరగలేదన్నారు. కాపుల సంక్షేమానికి చేసిందేమిలేదన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషయంలో సీఎం జగన్ వారి పార్టీ నాయకులతో దారుణంగా తిట్టించడం ,ఆయన వ్యక్తి గత జీవితం గురించి విమర్శిస్తే ఈ మంత్రుల నోళ్ళు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎంత మంది కాపులకు పోస్టులు ఇచ్చారో.. రెడ్డిలకు ఎంతవరకు న్యాయం చేశారో తేలుద్దాం రండి అని సవాల్ చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు అంతమొందించి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం టీడీపీ, జనసేనలు పోరాడుతున్నాయని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa