ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా పాటలను తెగవాడేసుకొంటున్నారు...ఎమ్మార్టీ మ్యూజిక్ ఫిర్యాదు

national |  Suryaa Desk  | Published : Fri, Nov 04, 2022, 11:53 PM

భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రదర్శిస్తున్న జోష్ కు బ్రేకులేసేలా ఎమ్మార్జీ మ్యూజిక్ చర్యలు తీసుకొంటోంది. ఈ నేపథ్యంలో భారత్ జోడో పేరిట పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. పాదయాత్రలో కేజీఎఫ్-2 పాటలను వినియోగిస్తున్నారంటూ రాహుల్ గాంధీ తదితరులపై కేసు నమోదైంది. కేజీఎఫ్-2 పాటలపై హక్కులను కలిగివున్న బెంగళూరుకు చెందిన ఎమ్మార్టీ మ్యూజిక్ అనే మ్యూజిక్ ప్లాట్ ఫాం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, సుప్రియా శ్రీనటే కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఎమ్మార్టీ మ్యూజిక్ పేర్కొంది.


కేజీఎఫ్-2 హిందీ వెర్షన్ పాటలపై హక్కులను సొంతం చేసుకునేందుకు తాము భారీ మొత్తంలో చెల్లించామని, అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అనుమతి లేకుండా ఈ పాటలను వాడుకుంటున్నారని, తమ పాటల బ్యాక్ గ్రౌండ్ తో వీడియోలు రూపొందిస్తున్నారని ఎమ్మార్టీ మ్యూజిక్ ఆరోపించింది. ఎమ్మార్టీ మ్యూజిక్ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa