ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇప్పటం గ్రామంలో కాంగ్రెస్ నేతల బృందం పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 05, 2022, 03:24 PM

గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలో కాంగ్రెస్ నేతల బృందం పర్యటించింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులను కాంగ్రెస్ బృందం పరామర్శించింది. అన్యాయం గా ఇళ్లు కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మస్తాన్ వలీ మాట్లాడుతూ... ఇప్పటం ఓ చిన్న పల్లెటూరు అని... పల్లెటూరులో 120 అడుగుల రోడ్డు పేరుతో ఇళ్లు కుల్చారని అన్నారు. రాజకీయ కుట్రతోనే ఇళ్లు కుల్చివేశారని మండిపడ్డారు. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దౌర్జన్యం ఇళ్లు కూల్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు నష్టం పరిహారం చెల్లించాలని అన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని మస్తాన్ వలీ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa