ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసుల వలయంలోకి జనసేన అధినేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 05, 2022, 03:21 PM

గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామం పోలీసుల వలయంలోకి వెళ్లింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఇప్పటం గ్రామానికి వచ్చారు. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ప్రభుత్వం ఇల్లు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధితులను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్  నేడు గ్రామానికి వచ్చారు. దీంతో జనసేన అధినేత పర్యటన దృష్ట్యా పోలీసు భారీగా బందబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పోలీసులు ముళ్ళ కంచేతో భద్రత కల్పించారు. అటు జనసేన కార్యాలయం వద్ద కూడా పోలీసు బలగాలు చేరుకున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa