రాష్ట్రంలో ప్రతిపక్షాలను అణిచివేసేందుకే వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతున్నదని జనసేన పార్టీ గాజువాక ఇన్చార్జి కోన తాతారావు విమర్శించారు. శుక్రవారం అయ్యన్నపాత్రుడుని జనసేన నాయకులు పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. బీసీ నాయకుడు అయ్యన్నపై సీఐడీ పోలీసులు మద్యం మత్తులో అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. ప్రజల మనిషిగా రాష్ట్రంలో గుర్తింపు పొందిన అయ్యన్న వంటి నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ఇటివంటి దుర్మార్గపు పాలనను అంతమొందించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పీవీఎస్ఎన్. రాజు, పసుపులేటి ఉషాకిరణ్, పంచకర్ల సందీప్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa