మధ్యప్రాచ్య దేశాల మధ్య కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ఈ అంశంపై భారత్లో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతుండగా, మరోవైపు పాకిస్థాన్ పెట్రోలియం శాఖ మంత్రి Musadik Malik భారత చమురు నిల్వ సామర్థ్యాన్ని ప్రశంసించారు.అదే సమయంలో తమ దేశ పరిస్థితి విషమంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘సమా టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్లో కనీసం ఒక్క రోజు అవసరాలకు సరిపడే వ్యూహాత్మక చమురు నిల్వ కూడా లేకపోవడం తీవ్ర సమస్యగా మారిందని చెప్పారు.ప్రస్తుతం తమ దేశంలో కేవలం 15 నుంచి 18 రోజులకు సరిపడా వాణిజ్య ముడి చమురు నిల్వలే ఉన్నాయని, చమురు కంపెనీల వద్ద మరో 20 నుంచి 21 రోజులకు సరిపడా నిల్వలు ఉండొచ్చని ఆయన వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునే Strategic Petroleum Reserve లేకపోవడం పెద్ద లోటుగా మారిందని పేర్కొన్నారు.ఇదే సమయంలో భారత్ సామర్థ్యాన్ని ప్రస్తావిస్తూ, దేశంలో 60 నుంచి 70 రోజుల డిమాండ్ను తీర్చగలిగేంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఒక్క సంతకం చేస్తే చాలు, ఆ నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.వ్యూహాత్మక చమురు నిల్వలు అనేవి రోజువారీ వినియోగానికి కాకుండా, యుద్ధాలు లేదా సరఫరా అంతరాయం వంటి అత్యవసర పరిస్థితుల్లో దేశ అవసరాలను తీర్చేందుకు భూగర్భంలో నిర్మించే భారీ నిల్వ కేంద్రాలు. ఇవి అత్యవసర సమయాల్లో మాత్రమే వినియోగించబడతాయి.భారత్లో ప్రస్తుతం కర్ణాటకలోని Mangaluru, Padur అలాగే ఆంధ్రప్రదేశ్లోని Visakhapatnam ప్రాంతాల్లో ఈ భూగర్భ చమురు నిల్వ కేంద్రాలు ఉన్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం సుమారు 53.3 లక్షల మెట్రిక్ టన్నులు (దాదాపు 36.92 మిలియన్ బ్యారెల్స్)గా ఉండి, దేశ అవసరాలను 60 నుంచి 70 రోజుల పాటు తీర్చగల సామర్థ్యం కలిగి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa