ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు 25 రకాల పాముల ప్రదర్శన, అవగాహన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 06, 2022, 11:05 AM

పాములు మానవాళికి ఎలాంటి హాని తలపెట్టవని ఎర్రగొండపాలెం అటవీ శాఖ రేంజర్ నీలకంఠరెడ్డి అన్నారు. త్రిపురాంతకం మండలంలోని మేడపి జడ్పీ పాఠశాలలో పాములపై శనివారం విద్యార్థులకు అవగాహన, ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాములు కనిపిస్తే చంపకుండా అటవీ సిబ్బందికి సమాచారాన్ని అందిస్తే వాటిని పట్టుకుని అడవిలో వదిలేస్తారన్నారు. 25 రకాల పాములు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్నేక్ రీస్క్యూర్ గురవయ్య, మల్లికార్జున, శ్రీనివాస్, హెచ్ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa