ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మత్స్యకారులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 06, 2022, 12:20 PM

ఎన్టీఆర్ జిల్లా, కృష్ణానది వరదల కారణంగా గత నాలుగు నెలలుగా చేపల వేట నిలిచిపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న గ్రామంలోని 167 మత్స్యకా రుల కుటుంబాలకు ఆదివారం ఇబ్రహీంపట్నంలో ని గణేష్ ట్రాన్స్పోర్ట్ అధినేత వేములపల్లి విజయ రాం ప్రసాద్ బియ్యం కందిపప్పు నూనె చింతపండు వంటి నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గ్రామంలో పర్యటించిన సమయంలో మత్స్య కార్మికులు తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు దీనితో ఆయన స్పందించి తన వంతుగా గ్రామంలోని మత్స్య కార్మికులకు బియ్యం, నిత్యవసర వస్తువులను అందజేసామని తెలిపారు. ఇబ్రహీంపట్నం మండల టిడిపి అధ్యక్షులు రామినేని రాజశేఖర్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన మత్స్య కార్మికుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని రాంప్రసాద్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలియజేశారు. పేద ప్రజలను ఆదుకోవడంలో తన సహకారం అందించిన రాంప్రసాద్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులోను మత్స్యకారుల కు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తాడికొండ రామకృష్ణ , సుంకర విష్ణు కుమార్, రంగు బుచ్చిబాబు, వెలగపూడి రామకృష్ణ, జాస్తి శ్రీనివాసరావు, మత్స్య కార్మికుల నాయకులు అబ్రహం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa