ప్రభుత్వ పరిపాలన విధానంపై ప్రజల నుండి అడిగి తెలుసుకునేందుకు ఏర్పాటుచేసిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఉయ్యురు మండలం పెదవోగిరాల గ్రామంలో ఆదివారం నిర్వహించిన యాత్రలో పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు కొలుసు పార్థసారథి పాల్గొని గడపగడపకు తిరుగుతూ ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ పాలనపై సంక్షేమ పథకాల అందుతున్న తీరుపై ఆరా తీశారు. ఈ క్రమంలో స్థానికులు శాసనసభ్యులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అన్ని అర్హులైన మాకు అందుతున్నాయని ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. దీంతో శాసనసభ్యులు పార్థసారథి రాష్ట్ర అభివృద్ధి జగన్ ప్రభుత్వం సాధ్యమన్నారు సంక్షేమ పథకాల అమలుతీరితో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నారు అభివృద్ధికి చిరునామాగా ఉన్న జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో పలు శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa