పలాస నియోజకవర్గంలో ఏదో జరిగిపోయిందని ముద్ద పప్పు లోకేష్ ట్వీట్లు పెడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. కుటుంబ కలహాలను రాజకీయ లబ్ధి కోసం ఇతరులపై నెట్టేయడం తండ్రి నుంచి లోకేష్కు వారసత్వంగా అబ్బినట్లు ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు 420 అయితే కొడుకు లోకేష్ ఆయనకు మించి తయారడయ్యాడని ధ్వజమెత్తారు. మందస మండలంలోని హరిపురంలో జరిగిన వివాదానికి సంబంధించిన అసలు విషయం లోకేష్కు తెలుసా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ అంటే చంద్రబాబు, లోకేష్లకు భయం అనే విషయం అర్థమవుతోందని, అందుకే అసత్య ప్రచారాల తోపాటు అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారని దుయ్యబట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa