ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బార్య..భర్తల గొడవ...ఛేజింగ్ సీన్ ను తలపించింది

national |  Suryaa Desk  | Published : Sun, Nov 13, 2022, 10:57 PM

భార్య భార్తల గొడవ కేరళ రాష్ట్రంలో ఛేజింగ్ సీన్ ను తలపించేలా చేసింది. ఇక అసలు కథనంలోకి వెళ్లితే... కేరళలోని తిరువనంతపురంలో ఓ మహిళ బైక్‌‌పై వెళ్తున్న వ్యక్తిని వెంబడించింది. ఆమెను చూసిన స్థానికులు, పోలీసులు కూడా ఆ వ్యక్తిని దొంగ అనుకుని ఛేజ్ చేశారు. చివరిలో అసలు విషయం తెలుసుకుని అంతా నోరెళ్లబెట్టారు. పతనంతిట్టకు చెందిన దంపతులు బైక్‌పై అజూర్‌ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే అక్కడ గొడవపడ్డారు. దీంతో కోపగించుకున్న భర్త... బైక్‌ దిగమని భార్యను గద్దించాడు. ఆమె కిందకు దిగడంతో... అక్కడే వదిలేసి బైక్‌పై వెళ్లిపోయాడు. దాంతో ఆ మహిళ అతడిని వెంబడించడం మొదలుపెట్టింది.


అయితే బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఒక మహిళ వెంబడించడాన్ని స్థానికులు చూశారు. ఆ సీన్ చూసిన వెంటనే వాళ్లు చైన్‌ లేదా బ్యాగ్‌ చోరీ చేసి అతడు పారిపోతున్నాడని అనుకున్నారు. ఇక వారు కూడా అతడిని ఛేజ్ చేశారు. మరోవైపు ట్రాఫిక్‌ పెట్రోలింగ్‌ విధుల్లో ఉన్న పోలీసులు గమనించి.. వారు కూడా వెంబడించారు. ఇలా ఎక్కువ మంది ఆ వ్యక్తి వెంట పడడంతో అజూర్ పోలీస్ స్టేషన్ రోడ్డులో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.


చివరికి స్థానికులు ఆ మహిళను ఆపి ఏం జరిగిందని ఆరా తీశారు. వారంతా ఆమెను వెంబడిస్తున్నట్టు అప్పుడే ఆమెకు కూడా అర్థమైంది. దాంతో జరిగిన విషయం చెప్పడానికి సందేహించింది. అయితే పోలీసులు గట్టిగా అడగడంతో అసలు విషయం చెప్పక తప్పలేదు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తన భర్తేనని, తమ మధ్య గొడవ జరుగడంతో కోపంతో తనను వదలి వెళ్లిపోతున్నాడని తెలియజేసింది. ఇది తెలుసుకున్న స్థానికులు, పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa