ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ జట్టు ఫైనల్‌లో ఆడటమే గొప్ప విషయం: మహమ్మద్ ఆమిర్

sports |  Suryaa Desk  | Published : Mon, Nov 14, 2022, 12:54 PM

ఫైనల్లో పాకిస్థాన్ ఓటమికి మాజీ పేసర్ మహ్మద్ అమీర్ వెటకారమాడాడు. పాకిస్థాన్ జట్టు ఫైనల్ ఆడడం గొప్ప విషయమని అన్నాడు. 'మేం ఎలా ఫైనల్‌కు చేరుకున్నామో ప్రపంచం మొత్తానికి తెలుసు. అల్లా మాకు సహాయం చేసాడు. మన బ్యాటర్ల ఆటతీరు చూస్తుంటే ఫలితం ముందే అర్థమవుతుంది అని అన్నాడు.మన బ్యాటర్ల ప్రదర్శన చూస్తే ఫలితం ముందే అర్థం అయిపోతుంది' అని చెప్పాడు. సిడ్నీ నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇలాంటి ఫలితమే వస్తుందని ఆమిర్ ముందే ఊహించాడు. అదే విషయాన్ని మరోసారి చెప్పాడు. 


ఈ టోర్నమెంట్‌ను భారత్ చేతిలో ఉత్కంఠ భరిత ఓటమితో ప్రారంభించిన పాకిస్తాన్.. ఆ తర్వాత జింబాబ్వే చేతిలో కూడా చివరి బంతికి ఓటమి చవిచూసింది. అయితే గ్రూప్-2లో ఓటమి ఎరుగని సౌతాఫ్రికాను ఓడించింది. అనంతరం నెదర్లాండ్స్‌పై కూడా గెలిచింది. కానీ అప్పటికే దాదాపుగా సౌతాఫ్రికా, ఇండియా సెమీస్ చేరతాయని అంతా అనుకున్నారు. అలాంటి సమయంలో అనూహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓటమి చవి చూసింది. తర్వాతి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచిన పాక్ సెమీస్ చేరుకుంది. సెమీఫైనల్ ఒక్కటే పాకిస్తాన్ జట్టు గట్టిగా ఆడి గెలిచిందని చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో న్యూజిల్యాండ్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa