ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడుపునొప్పి తాళలేక యువకుడు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 14, 2022, 01:50 PM

హిందూపురం, మండలంలోని జీవ్‌మాకులపల్లికి చెందిన యువకుడు సంజీవరెడ్డి(19) కడుపునొప్పి తాళలేక ఆదివారం ఆత్మహత్య చేసుకున్నా డు. వివరాల్లోకి వెళ్ళితే....  రామక్రిష్ణారెడ్డి రెండో కుమారుడు సంజీవరెడ్డి కియ పరిశ్రమలో పని చేస్తుండేవాడు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. నొప్పి భరించలేక మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో తాడుతో ఇంటిపైకప్పునకు ఉరేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa