ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి ఇది నిదర్శనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 14, 2022, 01:50 PM

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజవర్గం మందస మండలం హరిపురంలో ఇద్దరు మహిళలపై కంకరమట్టి పోసిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్  స్పందించారు. దానికి సంబంధించిన వీడియోను పవన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వైసీపీ  చట్ట వ్యతిరేక కార్యకలాపాకు, అరాచకాలకు ఈ వీడియో నిదర్శనమంటూ జనసేనాధిపతి ట్వీట్ చేశారు. ‘‘హరిపురంలో కొట్రు దాలమ్మ, ఆమె కుమార్తె మజ్జి సావిత్రిపై కంకరమట్టి పోశారు. ముసలామె 'నేను చచ్చిపోతున్నాను' అని రోధిస్తున్నా.. చచ్చిపో అని హెచ్చరించే ఓ కంఠంలోని కాఠిన్యానికి దన్నుగా నిలిచే వ్యవస్థ ఎవరిది?’’ అంటూ పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa