స్టాక్ బ్రోకర్ల కోసం సెబీ ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకాన్ని 111 సంస్థలు ఉపయోగించినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ తాజాగా వెల్లడించింది.కొన్ని ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ ప్లాట్ఫారమ్లతో సహకరించిన బ్రోకర్లపై ఉన్న ఎన్ఫోర్స్మెంట్ చర్యలను ఆపేందుకు సెబీ ఈ సెటిల్మెంట్ పథకాన్ని ప్రారంభించింది.సెబీ ప్రకారం, ఒక్కో సంస్థ రూ.1 లక్ష చొప్పున చెల్లించి కేసులను సెటిల్ చేసుకోవచ్చునని పేర్కొంది. ప్రారంభంలో ఈ పథకం 2025 జూన్ 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు అమలులో ఉండగా, భారీ స్పందనను చూసి సెబీ చివరి గడువును 2025 అక్టోబర్ వరకు పొడిగించింది.ఈ పథకం ద్వారా, వివిధ కోర్టులు లేదా సెబీ ఎదుర్కొన్న నిబంధనల ఉల్లంఘన ఆరోపణలను ఎదుర్కోవాల్సిన బ్రోకర్లకు న్యాయ ప్రక్రియలో తాత్కాలిక ఉపశమనం లభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa