ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గొర్రె పిల్లలను కొరికి చంపిన కుక్కలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 14, 2022, 01:52 PM

ధర్మవరం మండలంలోని బుడ్డారెడ్డిపల్లిలో గొర్రెల కాపరులు హరిజన నారాయణస్వామి, హనుమంతరెడ్డికి చెందిన 18గొర్రె పిల్లలు కుక్కలు దాడిలో మృత్యువాత పడ్డాయి. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. గొర్రెల కాపరులు హరిజన నారాయణస్వామి, హనుమంతరెడ్డి ఆదివారం గ్రామసమీపంలో తమ గొర్రెలను మేతకోసం తీసుకెళ్లారు. గ్రామ సమీపం లోనే 18గొర్రె పిల్లలను గూడుకింద వేసి వెళారు. ఆ గూడులోకి కుక్కలు దూరి 18గొర్రె పిల్లలను కొరికి చంపి చిందరవందంగా వేసి వెళ్లాయి. గొర్రెలకాపరులు గొర్రెలను తోలుకుని అక్కడికి తిరిగి వచ్చే చూసే సరికి మృత్యువాత పడిని గొర్రెపిల్లలు కనిపించాయి ఆ పిల్లలు మృత్యువాత పడటంతో వాటి తల్లులు గొర్రెలు అరుపులతో బాధను వ్యక్తం చేశాయి. మృతిచెందిన గొర్రెపిల్లల్లో 15 నారాయణస్వామికి చెందినవి కాగా, మరో 3హనుమంతరెడ్డికి చెందినవి. దీంతో సుమా రు రూ.లక్ష వరకు నష్టపోయినట్లు బాధిత గొర్రెలకాపరులు వాపోయారు. కాగా మృత్యువాత పడి చిందరవందంగా పడిన గొర్రె పిల్లలను చూసి కాపరి హరిజన నారాయణస్వామి చలించిపోయి సృహతప్పి అక్కడే పడిపోయాడు. వెంటనే తోటి కాపరులు అతడిని చికిత్సనిమిత్తం ముదిగుబ్బ మండలం క్రిష్ణాపురానికి తీసుకెళ్లారు. కాగా గ్రామంలో కుక్కలు అధికంగా ఉన్నాయ ని గ్రామస్థులు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa