ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండోనేషియాకు బయల్దేరిన ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Mon, Nov 14, 2022, 01:52 PM

ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటన కోసం ఇండినేషియాలోని బాలీకి బయల్దేరారు. ఈ పర్యటనలో G20 సదస్సులో పాల్గొంటారు. అంతేకాకుండా, దాదాపు 20 భేటీల్లో ప్రధాని పాల్గొంటారని సమాచారం. G20 సదస్సు అనంతరం అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తోనూ మోదీ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. కాగా, G20 నిర్వహణను డిసెంబరు 1న ఇండోనేషియా నుండి భారత్ స్వీకరించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa