ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2200 రైతులు ఉంటే కేవలం 1400 మందికి మాత్రమే బీమా అందింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 14, 2022, 01:53 PM

రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం సాగిస్తామని అనంతపురం టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఆదివారం మండలంలోని గరిమేకల నుంచి పేరూరు వరకు రైతు కోసం టీడీపీ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు రైతులు, నాయకులు, అభిమానులు తరలివచ్చారు. పేరూరులో అంబేడ్కర్‌ విగ్రహానికి రైతుల సమస్యలపై వినతిపత్రం అందించి మాట్లాడారు. సీఎం జగనరెడ్డి సగం మాత్రమే బటన నొక్కి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. పాదయాత్రలో తాను చాలా మంది రైతులను కలిశానని ఇన్సూరెన్స, సబ్సిడీ రాలేదని నా దృష్టికి తెచ్చారన్నారు. ఎంసీ పల్లి పంచాయతీలో 2200 రైతులు ఉంటే కేవలం 1400 మందికి మాత్రమే బీమా అందిందని, మిగిలిన వారు రైతులు కాదా అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa