ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడివాడలో ఈ సారి మేమే గెలిచేది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 14, 2022, 02:05 PM

తెలుగుదేశం పార్టీకి ఉజ్వల భవిష్యత్‌ ఉందని, అధికారంలోకి రావడం తథ్యమని గుడివాడ   మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. పర్నాస గ్రామం లో ఆదివారం రావి ఆధ్వర్యంలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పర్నాస మాజీ సర్పంచ్‌ పల్లపోతు బసవయ్య, పల్లపోతు రాంబాబు, గంటా రాము, నల్లబ్బాయి తదితరులకు రావి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. వైసీపీకి చెందిన జగన్‌ పరిపాలన నచ్చక పల్లపోతు బసవయ్య టీడీపీలో చేరారన్నారు. గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయపతాక ఎగురవేయటం ఖాయమని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు. సమస్యలను ఎవరికి చెప్పుకున్నా ప్రయోజనం లేదని ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు వాసే మురళీ, ముళ్లపూడి రమేష్‌ చౌదరి, అంగడాల వీర్రాజు, చీకటి శేషగిరి, ముక్తినేని అమర్‌ బాబు, రేమల్లె రజని, అంగడాల శ్రీను, జానకి రామయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa