దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలపై కక్షగట్టిన వైసీపీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో గద్దె దించుతామని టీడీపీ సీకేదిన్నె మండల కన్వీనర్ తక్కోలి కృష్ణారెడ్డి, టీడీపీ ఎస్సీసెల్ కమలాపురం నియోజక వర్గ అధ్యక్షుడు పుల్లగూర శ్రీనివాసులు, టీడీపీ లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు అక్భర్ బాషా పేర్కొన్నారు. ఆదివారం చింతకొమ్మదిన్నె మండలం ఇందిరానగర్లో టీడీపీ మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు కమ్మటి పుల్లయ్య ఆధ్వర్యంలో కమలాపురం నియోజకవర్గ ఎస్సీ సెల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ పుత్తా నరసింహారెడ్డి నేతృత్వంలో ‘జై బీమ్... జై టీడీపీ’ నినాదంతో వాడవాడలా చైతన్య యాత్రలను చేపడుతున్నామన్నారు. ఈ యాత్రల వ్వారా దళిత, బడుగు, బలహీన వర్గాలలో అత్మస్థైర్యం, భరోసా నింపడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను, అసమర్ధ పాలను వివరించి చైతన్యవంతులను చేస్తామన్నారు. కమలాపురం నియోజక వర్గంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడంలేదన్నారు.ఈ సమావేశంలో టీడీపీ ఎస్సీసెల్ జిల్లా అధికార ప్రతినిధి టుంకూరు రామాంజనేయులు, కార్యనిర్వహక కార్యదర్శి కొండాల చెన్నయ్య, కమలాపురం నియోజక వర్గ ఎస్సీసెల్ కార్యదర్శి చెన్నూరు రాంప్రసాద్, ఎస్టీ సెల్ నియోజకవర్గ నాయకులు రామునాయక్ మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa