ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృషి చేస్తే ఆరునెలల్లో మార్పు వస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 14, 2022, 04:27 PM

అంగన్వాడి కేంద్రాల సిబ్బంది, సూపెర్వైజర్లు, సిడిపిఓలు, మహిళా పోలీసులు ఒక ఆరు నెలల పాటు గట్టిగా కృషి చేస్తే మార్పు వస్తుందని కలెక్టర్ చెప్పారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అరకు నియోజక వర్గం పరిధిలోని ఐసిడిఎస్ అధికారులు, మహిళా పోలిస్ లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయాలలో మహిళా పోలీస్ పాత్ర చాలా ముఖ్యమైనదని, వారు డీలర్ల రేషన్ షాపులు, ఎం. ఎల్. ఎస్ పాయింట్లు సందర్శించాలని, అంగన్వాడి సూపెర్వైజర్లు, ఆయాలు, హేల్పర్లకు సహకరించాలని సూచించారు. డీలర్లు అంగన్వాడి కేంద్రాలకు సక్రమంగా సరుకు పంపిణీ చేయటం లేదనే ఆరోపణలు, గర్భిణీలు ప్రసవాలకు ఆసుపత్రులకు రావటం లేదనే అంశాలపై కలెక్టర్ పై విధంగా స్పందించారు.

జిల్లాలో బరువు, ఎత్తు తక్కువున్న పిల్లలు, హై రిస్క్ గర్భిణీలు, రక్త హీనత తో భాద పడేవారు ఎక్కువగా ఉన్నారని, అటువంటి వారిపై ప్రత్యెక శ్రద్ధ కనపరచాలన్నారు. ఆరు నెలల నుండి 36 నెలల పిల్లలకు తప్పనిసరిగా పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాల న్నారు. రక్త హీనత తో బాధ పడుతున్న వారిని, హై రిస్క్ గర్భినీలను గుర్తించి వారికి సరైన అవగాహన కల్పించాలని క్రమం తప్పకుండా వారిని ట్రాక్ చేయాలని, వారి భర్తలతో మాట్లాడి పౌష్టికాహారం తీసుకోనేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఏ నెలలో కుడా అంగన్వాడి కేంద్రాలలో స్టాక్ ఉండకూడదని, ఎవరి రేషన్ వారికి ఇంటికే అందించాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో అధికంగా యువ మహిళా పోలీసులు ఉన్నందున గిరిజన గర్భిణీ, బాలింతల భాద్యతను వారు తీసుకోవాలని సూచించారు. ఇంట్లో వారికి సేవలు అందించే విధంగానే వారికి కూడా సేవలoదిoచాలన్నారు. మాత, శిశు మరణాల నివారణలో మహిళా పోలిస్ పాత్ర కీలకమన్నారు.అదే విధంగా సచివాలయా లలో ఉన్న వాలంటీర్ల సహాయంతో ఇంటికి రేషన్ పంపించాలన్నారు. వారు అంగన్వాడికి రానంత మాత్రాన వారికి పౌష్టికాహారం అందకుండా పోరాదని, తద్వారా వారు రక్త హీనతకు గురి కారాదని హితబోద చేసారు. రాలేకపోయిన గర్భిణీలు, బాలింతలకు వారి ఇంటికే పౌష్టికాహారం పంపించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు.

ఈ సమావేశంలో శిక్షణ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఐసిడిఎస్ పధక సంచాలకులు సూర్య లక్ష్మి, అరకు నియోజక వర్గం పరిధిలోని అనంతగిరి, అరకు, దుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచింగిపుట్టు మండలాల ఎంపిడిఒలు, ఐసిడిఎస్ సిడిపిఓలు, సూపెర్వైజర్లు, ఆయా మండలాల మహిళా పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa