ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిసెంబ‌ర్ 7 నుంచి 29వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు

national |  Suryaa Desk  | Published : Sat, Nov 19, 2022, 09:59 PM

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు డిసెంబ‌ర్ 7 నుంచి 29వరకు జరగనున్నాయి. ఈమేరకు షెడ్యూల్ విడుదలైంది.  డిసెంబ‌ర్ 7వ తేదీ నుంచి శీతాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి వెల్లడించారు. డిసెంబ‌ర్ 7 నుంచి 29వ తేదీ వ‌ర‌కు ఉభయసభల స‌మావేశాలు కొన‌సాగుతాయ‌ని పేర్కొన్నారు. శీతాకాల సమావేశాల్లో మొత్తం 17 పనిదినాలు ఉంటాయని చెప్పారు. ఈ స‌మావేశాల్లో ప‌లు బిల్లులు, అంశాల‌పై చ‌ర్చిస్తామ‌న్నారు. రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్  ధన్ కర్ ఎగువ సభలో కార్యకలాపాలను నిర్వహించే మొదటి సెషన్ ఇది కావడం గమనార్హం.


కాగా, పార్లమెంట్ సమావేశాల కంటే ముందే ఈ నెల 21వ తేదీన ప్రీ బడ్జెట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం  నిర్వహించనుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ఈ సమావేశాలను ప్రారంభిస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ తయారీకి సూచనలు కోరుతూ మంత్రి సమావేశాలు నిర్వహించనున్నారు. పరిశ్రమల చాంబర్లు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ రంగం నిపుణులతో దృశ్యమాధ్యమం ద్వారా సమావేశం అవుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa