చంద్రబాబు , దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ కలిసి కుట్రలు చేస్తున్నారని, టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీ.. జనసేన అంటే రౌడీ సేన అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న నరసాపురంలో జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై జనసేన నేత కీర్తన స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో రౌడీ సేన ఎవరో? రౌడీయీజం ఎవరు చేస్తారో అందరికీ తెలుసునని అన్నారు. కడపను రౌడీ రాజ్యంగా, పులివెందులను ఫ్యాక్టనిస్టుగా చేసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, అన్న నిజంగా గ్రేట్ అని పేర్కొన్నారు. సీఎం ఏ పబ్లిక్ మీటింగ్లోనైనా అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో చేసిన అభివృద్ధి గురించి చెప్పారా?.. అలాగే ఈ వారం అప్పుల కోసం వెళ్లకుండా రాష్ట్రంలో ఆదాయం సృష్టించినట్లు చెప్పారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎక్కడ మీటింగ్ పెట్టినా చంద్రబాబు, పవన్ కల్యాణ్లపై వ్యక్తిగత దూషణలు చేయడం.. వైసీపీ నేతలతో బూతులు తిట్టించడం తప్ప రాష్ట్రంలో అభివృద్ది శూన్యమన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డిని (బొత్స, కన్నబాబు, రోజా) ఎవరు తిట్టారో వాళ్లకే మంత్రిపదవులు ఇచ్చారన్నారు. బూతులంటే జగన్నకు అంత ప్రేమని అన్నారు. పాదయాత్ర సమయంలో చేసిన హామీలు పూర్తిగా అమలు చేయలేదని కీర్తన తీవ్రస్థాయిలో విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa