ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 27, 2022, 03:09 PM

ఏపీలోని గుంటూరు జిల్లా ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిహారం అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 'నేను మీలా ఢిల్లీ వెళ్లి చాడీలు చెప్పను. వైసీపీని దెబ్బకొట్టాలంటే మోడీకి చెప్పి చేయను. నేను ఇక్కడే పుట్టినవాడ్ని.. ఇక్కడే తేల్చుకుంటా. నా యుద్ధం నేను చేస్తా. సజ్జల, వైసీపీ నేతలది ఆదిపత్యపు అహంకారం. వైసీపీకి 175 సీట్లకు 175 రావాలంట. మేము చూస్తూ కూర్చుంటామా. ఎమ్మెల్యేలు, సీఎం ల కొడుకులు రాజకీయాల్లో ఉండటం కాదు. సామాన్యులు రాజకీయాల్లోకి రావాలి. 2024 కీలకమైన ఎన్నికలు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ నేతలు మూల్యం చెల్లించుకోవాల్సిందే' అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa