ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్మార్ట్‌ఫోన్‌ వ్యసనంపై ఆసక్తికర ట్వీట్‌

national |  Suryaa Desk  | Published : Sun, Nov 27, 2022, 03:30 PM

స్మార్ట్‌ఫోన్‌ వ్యసనంపై ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర ట్వీట్‌ చేశారు. వృద్ధులు తలలు వంచి, రెండు చేతులను పైకి లేపి ఫోన్ పట్టుకున్నట్లుగా ఓ కార్టూన్‌ను ఆయన ఇవాళ షేర్‌ చేశారు. ‘’నిజానికి ఈ కార్టూన్ తీవ్రంగా నిరుత్సాహ పరుస్తుంది. కానీ ఫోన్‌ను పక్కకు పెట్టాలనే నిర్ణయం తీసుకునేలా చేసింది. ఈ ట్వీట్ తర్వాత.. నా ఫోన్‌ను పక్కన పెట్టేస్తా. ఈ రోజు మొత్తం తల నిటారుగా పెట్టే గడిపేస్తా’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆయన పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ.. ఇది నిజంగా సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa