బలహీన వర్గాల ప్రజలను విద్య ద్వారా సమాజంలో ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పిన మహానుభావుడు జ్యోతి రావు పూలే అని మంత్రి జోగి రమేష్ అన్నారు. వందల ఏళ్ళ కిందట వేసిన బీజాలను ముందుకు తీసుకుని వెళుతున్న నాయకుడు వైయస్ జగన్ అని ఆయన ప్రశంసలు కురిపించారు. పూలే ఆలోచనలను ఆ రోజు వైయస్ రాజశేఖరరెడ్డి, ఇవాళ వైయస్ జగన్ ఆచరణలో చూపిస్తున్నారన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అని, సామాజిక న్యాయ నిర్మాత వైయస్ జగన్ అని మంత్రి జోగి రమేశ్ అభివర్ణించారు. అభినవ పూలే వైయస్ జగన్ అని, అడగకుండానే బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తున్న జగన్ కు మనం అందరం అండగా నిలబడాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa