ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి వారిని తప్పించామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో మంత్రి సీదిరి అప్పరాజు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన శనివారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఈ నెల 7వ తేదీన విజయవాడలో జరిగే ‘జయహో బీసీ’ మహాసభను విజయవంతం చేయాలని వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఓడిపోతామనే భయంతోనే ఎన్నికల విధుల నుంచి టీచర్లను తప్పించారన్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అంటున్నారని.. దానిపై మీ స్పందనేంటి? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. మంత్రి బొత్స ఘాటుగా స్పందించారు. ‘‘లోకేష్నే వచ్చి టీచర్లను అడగమనండి. ఉపాధ్యాయులే ‘సార్.. మాకు ఏవిధమైన విధులు ఉండకూడదు. బోధించడం తప్ప ఏవిధమైన కార్యక్రమాలు మాకు అప్పగించొద్దు’ అని రిక్వెస్ట్ చేశారు.’’ అని మంత్రి బొత్స అన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకొనే ఉపాధ్యాయులకు తాము వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్ చెప్పిన మాదిరి రాష్ట్రంలో చేసిందే చెప్తున్నామని.. చేయబోయేదీ చెప్తున్నామని అని మంత్రి బొత్స వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa