రాష్ట్రంలో ప్రాంతీయ, కుల, మత విధ్వేషాలను రెచ్చగొడుతూ సీఎం జగన్ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని మాజీ మంత్రి, టీడీపీ నాయకులూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. ‘ఇదేంఖర్మ బీసీలకు’ పేరుతో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆలపాటి పాల్గొని టీడీపీ శ్రేణులతో కలసి తహసీల్దారు రవిబాబుకు వినతి పత్రం అందజేశారు. వైసీపీ నేతలు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ అరాచకం సృష్టిస్తున్నారని, రాష్ట్రాన్ని దోచుకుంటూ రూ.లక్ష కోట్లకు పైగా దోపిడి చేశారని ఆరోపించారు. కార్పొరేషన్లు పేరుకే వేశారని, ఎలాంటి నిధులు విధులు లేకుండా అలంకార ప్రాయంగా ఉన్నాయని చెప్పారు. ఒకే సామాజికవర్గానికి ప్రభుత్వ నియామకాల్లో చేస్తూ ఇతర కులాలకు అన్యాయం చేస్తున్నారన్నారు. బీసీలకు ఎన్టీఆర్ పెద్దపీట వేస్తే అనంతరం టీడీపీ పాలనలో చంద్రబాబు నాయుడు పట్టం కట్టారని చెప్పారు. రాష్ట్రంలో బీసీలకు ఎవరికైనా వైసీపీ నేతలు న్యాయం చేశారా అని ప్రశ్నించారు. బీసీలకు రీయింబర్స్మెంట్ లేదని, విద్య, ఉద్యోగాల్లో అవకాశాల్లేకుండా చేశారన్నారు. బీసీలను మాయ చేసేందుకే సభలు పెట్టుకునేందుకు సిద్ధమయ్యారని, సీఎం జగన్ మాటలు నమ్మే స్థితిలో బీసీలు లేరని, ఈ రాష్ట్రం నుండి వైసీపీ పీడ ఎప్పుడూ వదులుతుందా అని ఎదురు చూస్తున్నారని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa