రాయలసీమ గర్జన ఆరంభం మాత్రమే...హై కోర్టు వచ్చేవరకూ మా పోరాటం ఆగదని రాయలసీమ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. రాయలసీమ ప్రజల గర్జన చూసైనా చంద్రబాబులో మార్పు రావాలి.. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వేసిన కేసులు ఉపసంహరించుకుని మనస్ఫూర్తిగా కర్నూలులో హైకోర్టు వచ్చేలా సహకరించాలని సూచించారు. కర్నూలులో నిర్వహించిన రాయలసీమ గర్జన విజయవంతమైందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, హఫీజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, శ్రీదేవి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి తెలిపారు. కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్లో వారు మీడియాతో మాట్లాడారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa