తమిళనాడులోని చెంగల్ పట్టు వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కంటైనర్ ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులను చెన్నైకి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa