ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుమానాస్పద స్థితిలో ఏడు నెలల చిన్నారి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 08, 2022, 04:37 PM

విజయనగరం జిల్లా, పూసపాటిరేగ, మండలంలో విషాదం జరిగింది. ఏడు నెలల చిన్నారి..  ఏమైందో తెలీదు. తెల్లారేసరికి ఊపిరి లేదు. ఎలా చనిపోయాడో తెలియదు. ఎరుకొండ గ్రామంలో శంకా మనోజ్‌కుమార్‌ అనే బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మురళి, సత్యవతి కొడుకే మనోజ్‌కుమార్‌. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి 9వరకు తల్లిదదండ్రులిద్దరూ బాలుడితో సరదాగా గడిపారు. తమ పక్కనే పడుకోబెట్టుకున్నారు. బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో బాలుడు ఇంకా నిద్ర లేవకపోవడంతో కదిపారు. అయినా బాలుడిలో కదలిక లేదు. దీంతో సుందరపేట సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే మనోజ్‌కుమార్‌ మృతిపై అనుమానాలు ఉన్నాయని తండ్రి చెబుతున్నాడు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పూసపాటిరేగ ఎస్‌ఐ నరేష్‌ అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa