ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పురుషులతోపాటుగా మహిళలకి సమాన వేతనం ఇవ్వాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 08, 2022, 04:39 PM

పనిప్రదేశాల్లో మహిళలపై జరిగే వేధింపులను నిరోధించాలని పార్వతీపురం మహిళా శిశుసంక్షేమ అధికారి జి.వరహాలు పిలుపునిచ్చారు.  ఈసందర్భంగా వరహాలు మాట్లాడుతూ......  రాజ్యాంగం లింగభేదం లేకుండా అందరికీ సమానహక్కులు కల్పించిందని చెప్పారు. పనిప్రదేశాల్లో మహిళలపై వేధింపులకు పాల్పడితే చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పనిప్రదేశాల్లో మహిళలకు మౌలికసదుపాయాలు కల్పించాలని, పురుషులతోపాటుగా మహిళలకి సమాన వేతనంఇవ్వాలని కోరారు. పనిప్రదేశాల్లో వేధింపుల నిరోధక చట్టం ప్రకారం ఎవరైనా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే వెంటనే మహిళా శిశు సంక్షే మ అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa