ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల ఇబ్బందులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 08, 2022, 05:35 PM

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అద్దంకి నియోజకవర్గాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే కొనసాగించేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ తెలి పారు. బుధవారం మండలంలోని కొప్పెరపాడు వచ్చిన ఎమ్మెల్యే రవి కుమార్‌కు గ్రామస్థులు తమ ఇబ్బందులను ఏకరువుపెట్టారు. నూతన జిల్లా బాపట్లకు వెళ్లడానికి కనీసం బస్సు సౌకర్యం కూడా ఏర్పా టుచేయలేదన్నారు. అక్కడికి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేదన్నారు. దీనిపై స్పందించి ఎమ్మెల్యే రవికుమార్‌ మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. అధికారంలోకి రాగానే మరలా జిల్లాల పునర్విభజన చే స్తానని హమీ ఇచ్చారని చెప్పారు. అద్దంకి, కందుకూరు నియెజకవర్గా లను ప్రకాశం జిల్లాలో కొనసాగించి మార్కాపురంను జిల్లా కేంద్రం చేసేలా టీడీపీ అలోచనలో ఉందన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa