ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల జీవితాలతో వైసీపీ చెలగాటమాడుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 08, 2022, 05:39 PM

సంక్షేమం ముసుగులో వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఆర్థిక దోపిడీ చేస్తోందని, ప్రజల జీవితాలతో, వారి భవిష్యత్తుతో చెలగాట మాడుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. కృష్ణా జిల్లా, సత్యనారాయణపురం 31వ డివిజన్‌లో గవర్నమెంట్‌ ప్రెస్‌ వద్ద నుంచి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఇదేం ఖర్మ మన 31వ డివిజన్‌కు, ఇదేం ఖర్మ మన టీచర్స్‌కాలనీకీ, ఇదేం ఖర్మ మన అంబేడ్కర్‌ కాలనీకీ, ఇదేం ఖర్మ మన సగార కట్టకు అని నినదిస్తూ పాదయాత్ర చేశారు. ఇంటింటికీ తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇంటింటికీ కరపత్రాలు పం పిణీ చేశారు. 31వ డివిజన్‌లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప, మూడున్నరేళ్లలో అభివృద్ధి శూన్యమన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa