బీసీల వెన్నెముక విరిచిన వెన్నుపోటుదారుడు సీఎం జగన్ అని, వైసీపీ ప్రభుత్వ నవరత్నాల పథకాల వల్ల ఒక్క బీసీకైనా మేలు జరగలేదని జనసేన అధికార ప్రతినిధి, ఆ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ అన్నారు. విజయవాడ వన్టౌన్లోని జనసేన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన ఆయన మాట్లాడారు. బీసీలను బిచ్చ గాళ్లుగా మార్చి జయహో బీసీ అంటూ నాటకాలు ఆడుతున్నారన్నారు. సీఎం జగన్కు బీసీల హృదయాల్లో స్థానం లేదన్నారు. బీసీ సంక్షేమ శాఖ అనాథ సంక్షేమ శాఖగా మారిందని ఎద్దేవా చేశారు. జయహో సభలో బీసీలు పాల్గొనలేదన్నారు. జగన్కు తన సొంత సామాజికవర్గంపై ఉన్న అభిమానం బీసీలపై లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa