పలాస నియోజకవర్గం మందస మండలం చీపి గ్రామ పంచాయతీ లో ఇదేం ఖర్మ - మన రాష్ట్రానికి కార్యక్రమంను తెలుగుదేశం పార్టీ వారు శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బావన దుర్యోధన ఇంటి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై అభిప్రాయాలు తెలుసుకుని, పార్టీ ఇచ్చిన అభిప్రాయ సేకరణ పత్రoలో వివరములు సేకరించారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గౌతు శిరీష ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రట్టి లింగరాజు, ప్రధాన కార్యదర్శి లబ్బ రుద్రయ్య, ఐటీడీపీ మండల కన్వీనర్ తలగాన రాజశేఖర్, తామాడ ధర్మారావు, చీపి గ్రామ కమిటీ అధ్యక్షుడు సవర కోదండరావు, సవర ఈశ్వరరావు, సవర చైతన్య, సవర రఘురామ్, గార వెంకటరావు, సవర అర్జున, సత్యనారాయణ, సవర మేఘ, అంపోలు గోపాలకృష్ణ, సవర మోహన్, సవర లక్ష్మణ్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa