దేశవ్యాప్తంగా 2020-2022 మధ్య దేశంలో క్యాన్సర్ కేసులు, మరణాలు పెరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు. రాజ్యసభలో మంగళవారం ఆయన ప్రసంగించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ ప్రకారం నమోదైన గణాంకాలను ఆయన చదివి వినిపించారు. 2020లో దేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య 13,92,179 అని, 2021 ఆ సంఖ్య 14,26,447కి పెరిగిందని చెప్పారు. క్యాన్సర్ మరణాల విషయానికొస్తే 2020లో 7,70,230 మంది మరణించారని, 2021లో 7,89,202 మంది బాధితులు, 2022లో 8,08,558 మంది చనిపోయారని ఆయన వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa